ఆర్మూర్ ఎస్ హెచ్ ఓ సత్యనారాయణ గౌడ్ ఆధ్వర్యంలో శనివారం ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో డాగ్స్ తో తనిఖీలు నిర్వహించారు.
ఈ తనిఖీలు ప్రయాణికుల క్షేమం కోసం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చేపట్టబడ్డాయి.
ప్రయాణికులు, ప్రజలు అనుమానాస్పద వ్యక్తులను గుర్తించినప్పుడు పోలీసులకు సమాచారం అందించాలని ఎస్ హెచ్ ఓ సత్యనారాయణ గౌడ్ కోరారు.
ప్రయాణికులు తమ వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలని, బస్సు వెక్కి క్రమంలో వాటిని పోగొట్టుకోకుండా ఉండాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఆర్మూర్ పోలీస్ అధికారుల బృందం పాల్గొంది.

